
సినిమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చే రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయాలతో దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడంతో పాటు తయారీ రంగానికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రాజెక్టుల్లో భారతదేశాన్ని సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడం, మొబైల్ తయారీని విస్తరించడం, ఎరువుల రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం, అలాగే వారణాసిలో కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఉన్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాల వివరాలను మీడియాకు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!