

పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బండి సాయి భగీరథ్ అలియాస్ భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 8న కేసు నమోదు చేయగా, అనంతరం బాలిక వాంగ్మూలం ఆధారంగా పలు కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తు సమయంలో బాధితురాలు మరియు ఇతర సాక్షుల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు కరీంనగర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపారు. అలాగే నిందితుడిపై గాలింపు చర్యల భాగంగా లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా మంచిరేవుల టెక్ పార్క్ సమీపంలో నిందితుడిని సైబరాబాద్ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!