

ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమతో పాటు కళాకారులు, సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో విబి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన ‘వెండితెర మరియు ఓటీటీ అవార్డ్స్ 2025-26’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అనేక అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని, డబ్బింగ్, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. సినీ మౌలిక వసతుల అభివృద్ధికి ముందుకు వచ్చే వారికి భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ తరహాలో విజయవాడలోనూ తరచూ సినీ కార్యక్రమాలు, అవార్డు వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!