

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు భూములు కలిగిన వారికి రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే.. రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. భూమి ప్రైవేటుదిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితాలోని భూములను క్షుణ్నంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా సరైన జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!