

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. విదేశీ పర్యటనకు ముందు ఆయన దిల్లీ వెళ్లి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం లండన్కు బయలుదేరుతారు.
ఆగస్టు 21న లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సీఎం సందర్శించనున్నారు. ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు. అలాగే సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శిస్తారు. ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు వెళ్తారు.
ఆగస్టు 24న హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ క్యాంపస్లను సందర్శించనున్న సీఎం.. ఆగస్టు 25న నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీతో పాటు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందాలతో సమావేశం కానున్నారు. అనంతరం న్యూయార్క్కు వెళ్లి ఆగస్టు 26న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు బయలుదేరి, ఆగస్టు 30న నగరానికి చేరుకుంటారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!