
జనరల్

హైదరాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. ఖతార్ ఎయిర్లైన్స్ విమానంలో జెడ్డా వెళ్లేందుకు వచ్చిన ఓ దంపతుల వద్ద నకిలీ టికెట్లు ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ప్రయాణానికి ముందు టికెట్లను పరిశీలించే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టికెట్లలో తేడాలను గుర్తించిన అధికారులు దంపతుల ప్రయాణాన్ని నిలిపివేశారు. ఏజెంట్ మోసం చేసి నకిలీ టికెట్లు ఇచ్చి ఉండొచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అనే అంశాలపై అధికారులు మరింత వివరాలు సేకరిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!