
జనరల్

అయోధ్య రామమందిర విరాళాల సొమ్ము అపహరణ కేసులో ఒకే కుటుంబానికి చెందిన వారి పాత్ర వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు, వస్తువులు లెక్కించే బృందంలో నిందితుడి బావమరిది అనుకల్ప్ మిశ్రాకు ఉద్యోగం ఇప్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారం విశ్వాసం దుర్వినియోగంపై తీవ్ర చర్చకు దారి తీసింది.
స్థానికుల సమాచారం ప్రకారం అనుకల్ప్ మిశ్రా గ్రామశివార్లలో ఇటీవల ఫామ్హౌస్ నిర్మించారు. గతేడాది సుమారు రూ.65 లక్షల విలువైన ఇల్లు కొనుగోలు చేయగా, ఇప్పుడు స్కార్పియో కారు బుక్ చేసినట్లు తెలిసింది. ఈ ఆస్తుల పెరుగుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!