

దేశవ్యాప్తంగా నేడు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు సుమారు ₹3 వరకు పెంచారు. 2022 తర్వాత దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొనడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజా ధరలను అమలు చేశాయి.
గత నాలుగేళ్లుగా ప్రపంచ మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు పెద్దగా మారలేదు. అయితే ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. తాజా ధరల పెంపు కారణంగా రవాణా, ప్రయాణ ఖర్చులు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!