

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) దాదాపు 8 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరేలా ఈపీఎఫ్ స్కీమ్ 2026 పేరుతో కీలక మార్పులను ప్రకటించింది. ఇకపై ఉద్యోగులు తమ జీతం నుంచి పీఎఫ్ కింద ఎంత మొత్తం దాచుకోవాలనేది స్వయంగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నెలకు ₹15,000 చట్టబద్ధ వేతన పరిమితిపై 12 శాతం, అంటే గరిష్ఠంగా ₹1,800 తప్పనిసరిగా కట్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు అదనంగా స్వచ్ఛందంగా పీఎఫ్లో జమ చేయవచ్చు. అయితే ఆ అదనపు మొత్తానికి యజమాని సమానంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అలాగే పీఎఫ్ అడ్వాన్స్ ఉపసంహరణకు సంబంధించిన 13 కేటగిరీలను 3కు కుదించారు. ఇకపై అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితుల కింద డబ్బులు తీసుకోవచ్చు. సభ్యులు అర్హత కలిగిన కనీస నిల్వలో 100 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, రిటైర్మెంట్ భద్రత కోసం 25 శాతం నిల్వ తప్పనిసరిగా ఉంచాలి. అర్హత కలిగిన క్లెయిమ్లను 20 రోజుల్లో పరిష్కరించకపోతే సంబంధిత ఈపీఎఫ్వో కమిషనర్పై చర్యలు తీసుకుని, 12 శాతం వార్షిక వడ్డీ జరిమానాను వారి జీతం నుంచే వసూలు చేస్తామని సంస్థ స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!