

AI ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా OpenAI భారత విస్తరణపై కీలక ప్రకటన చేసింది. టాటా కంపెనీలతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన OpenAI CEO సామ్ ఆల్ట్మాన్, ఈ సంవత్సరం చివర్లో బెంగళూరు మరియు ముంబైలో రెండు కొత్త కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే న్యూఢిల్లీలో కార్యాలయం నిర్వహిస్తున్న OpenAI, ఇప్పుడు భారత్లో తన పాదముద్రలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న AI పర్యావరణ వ్యవస్థకు ఇది మరింత ఊతం ఇవ్వనుంది.
ఇది కేవలం కార్యాలయాల ఏర్పాటు మాత్రమే కాకుండా, దేశంలో AI నైపుణ్యాలను పెంపొందించే దిశగా తీసుకున్న అడుగుగా ఆల్ట్మాన్ పేర్కొన్నారు. భారత యువతలో ఉన్న సాంకేతిక ప్రతిభ, AI స్వీకరణ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. అదేవిధంగా, ప్రముఖ విద్యా సంస్థలతో విద్యా సహకార కార్యక్రమాలను ప్రారంభించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, మణిపాల్ అకాడమీ, ఎయిమ్స్ న్యూఢిల్లీ తదితర సంస్థలతో కలిసి ఈ చొరవను చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా 2027 నాటికి 1 లక్ష మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి మద్దతు లభించనుంది. పరిశోధన, విద్యా కార్యకలాపాలు, సంస్థాగత వ్యవస్థల్లో AI సాధనాల వినియోగాన్ని విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!