
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రూపొందించిన అవుట్లుక్ లైట్ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసే ఈ యాప్ వచ్చే నెల 25, 2026 నుంచి పూర్తిగా నిలిచిపోనుంది.
నెమ్మదిగా పనిచేసే ఇంటర్నెట్, తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్ల కోసం ఈ యాప్ను గతంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మొబైల్ ఈమెయిల్ సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ తన వ్యూహాన్ని మార్చుకుంది.
గడువు ముగిసిన తర్వాత ఈ యాప్ ద్వారా మెయిల్స్ చూడడం, పంపడం లేదా క్యాలెండర్ నిర్వహణ సాధ్యం కాదని సంస్థ తెలిపింది. వినియోగదారులు వెంటనే ప్రధాన అవుట్లుక్ మొబైల్ యాప్కు మారాలని సూచించింది. అందులో లాగిన్ అయితే పాత డేటా ఆటోమేటిక్గా సింక్ అవుతుంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!