
రాజకీయాలు

హంబర్గ్ స్క్వాష్ ఓపెన్లో భారత యువ క్రీడాకారుడు వీర్ చోత్రాని పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన బాప్టిస్ మసోట్టి చేతిలో 10-12, 11-9, 12-14, 11-9, 6-11తో ఓడిపోయాడు. తొలి గేమ్ నుంచే ఇద్దరి మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది.
69 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చోత్రాని కొన్నిసార్లు పుంజుకుని పోటీలోకి వచ్చినా, ప్రత్యర్థి సమర్థంగా ప్రతిస్పందించి మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు భారత ఆటగాళ్లు అభయ్ సింగ్, రమిత్ టాండన్, జోష్నా చినప్ప ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!