

హరారేలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ జట్టు చరిత్ర సృష్టించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా చెలరేగి 80 బంతుల్లో 175 పరుగులు సాధించి మ్యాచ్ను పూర్తిగా భారత వైపుకు తిప్పాడు. ఇది అండర్-19 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది.
కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ వైభవ్కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో అభిజ్ఞాన్ కుందు (40), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) వేగంగా పరుగులు చేయడంతో భారత్ 400 మార్కును దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు తీయగా, సెబాస్టియన్ మోర్గాన్ మరియు అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు సాధించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!