

అహ్మదాబాద్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు ముందు టీమిండియా జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్ మ్యాచ్కు ఎంపిక కాకపోవచ్చని సమాచారం. టోర్నమెంట్ మొత్తం అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఓపెనింగ్ కాంబినేషన్లో మార్పు చేసే ఆలోచనలో జట్టు మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త కాంబినేషన్పై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో వరుణ్ చక్రవర్తి కూడా ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లండ్ మ్యాచ్ల్లో ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతని స్థానంలో మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్లకు జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో జరిగే ఈ కీలక పోరులో టీమిండియా ఉత్తమ కాంబినేషన్తో బరిలోకి దిగి వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!