

25 ఏళ్ల తర్వాత భారత్ను టెస్ట్ సిరీస్లో వారి నేలపై ఓడించిన తొలి విజయం.. 2–0 వైట్వాష్! గౌహతి టెస్టులో భారత్ ఘోర పరాభవం — 408 పరుగుల తేడాతో సఫారీలు విజయం.
సొంతగడ్డపై భారత్కు భారీ దెబ్బ తగిలింది. రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. బ్యాటింగ్లో టీమ్ ఇండియా పూర్తిగా చేతులెత్తేసింది. జడేజా (54) తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరూ నిలబడలేకపోయారు.
చివరి రోజున రెండో ఇన్నింగ్స్లో భారత్ కేవలం 140 పరుగులకే ఆలౌటై భారీ పరాజయం మూటగట్టుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చలాయించారు. సైమన్ 6 వికెట్లు, కేశవ్, ముత్తుసామి, మార్కో చెరో వికెట్ తీసి భారత బ్యాటింగ్ను కూలదోశారు.
దీంతో సౌతాఫ్రికా 408 రన్స్ తేడాతో విజయం సాధిస్తూ, 25 ఏళ్ల తర్వాత భారత్ను వారి నేలపై ఓడించి చరిత్ర సృష్టించింది. భారత బ్యాటింగ్ బలహీనత మరోసారి బహిర్గతమైంది
స్కోర్లు
SA: 489/10, 260/5d
IND: 201/10, 140/10











.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!