

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు భారీగా 253 పరుగులు చేసింది.
భారత్ తరఫున వికెట్ కీపర్ సంజు సామ్సన్ అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు చేయగా, శివం దూబే 43 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 27 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు చేసి చివర్లో వేగంగా స్కోర్ను పెంచారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు పోరాడినా విజయం అందుకోలేకపోయింది. జేకబ్ బెతెల్ 48 బంతుల్లో 105 పరుగులతో అద్భుత సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. విల్ జాక్స్ 35 పరుగులు, జోస్ బట్లర్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.
చివరకు ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు అర్హత సాధించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!