
రాజకీయాలు

హాకీ ప్రపంచకప్లో భాగంగా పూల్-డి లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 0-0తో డ్రాగా నిలిచింది. గోల్ కోసం ఇంగ్లాండ్ క్రీడాకారిణులు పదేపదే దాడులు చేసినప్పటికీ.. భారత ప్లేయర్లు అద్భుత రక్షణతో వాటిని సమర్థంగా అడ్డుకున్నారు. దీంతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి.
ఈ డ్రాతో భారత్ ఐదు పాయింట్లు సాధించి పూల్-డి నుంచి రెండో రౌండ్కు అర్హత సాధించింది. మరోవైపు నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలక మ్యాచ్లో భారత జట్టు పట్టుదలతో రాణించి తదుపరి దశకు దూసుకెళ్లింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!