

భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్పై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఆరు మ్యాచ్ల ఈ పర్యటనకు సంబంధించిన తేదీలపై బీసీసీఐ, బీసీబీ మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో వాయిదా పడిన ఈ సిరీస్ను 2026 సెప్టెంబర్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్ సమీపిస్తున్న నేపథ్యంలో సిరీస్ మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ. బీసీసీఐతో తేదీలపై చర్చలు జరుగుతున్నాయని, అవసరమైతే షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహించనున్న గేమ్ డెవలప్మెంట్ ట్రోఫీ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, భారత్ సిరీస్ తేదీలు ఖరారైన వెంటనే స్థానిక టోర్నీని మరో వేదికకు మార్చగలమని స్పష్టం చేశారు.
భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు తుది అనుమతి రావాల్సి ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. తమ దేశంలో భద్రతకు ఎలాంటి సమస్య ఉండదని, భారత జట్టు తప్పకుండా వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని తమీమ్ ఇక్బాల్ తెలిపారు. అయితే ఇప్పటివరకు షెడ్యూల్పై పూర్తి స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. సిరీస్ యథావిధిగా జరుగుతుందా లేదా మరోసారి వాయిదా పడుతుందా అనేది త్వరలో తేలనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!