
జనరల్

సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీలో సమస్యలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఎలాంటి తప్పులకు తావులేకుండా పనిచేస్తేనే మంత్రులు, కిందిస్థాయి అధికారుల్లో క్రమశిక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారు.
22ఏ భూముల నిబంధనలను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదని, ఎన్నికల సమయంలో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ చేస్తున్న సూచనలు, సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!