
జనరల్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సుమంత్తో పాటు మరో ఐదుగురు ఇనుప రాడ్లతో తనపై దాడి చేశారని హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సుమంత్పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తొలుత మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతరం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!