

భారత స్టార్ షట్లర్లు గాయత్రి గోపీచంద్–ట్రీసా జాలీ జోడీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో చైనా జోడీ జియా యి ఫాన్–ఝాంగ్ షు జియాన్పై 16-21, 21-15, 21-13తో అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్లో వెనుకబడిన భారత జోడీ ఆ తర్వాత వరుసగా రెండు గేమ్లను గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకుంది.
దీంతో మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు 15 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం ఖాయం అయింది. చివరిసారిగా 2011లో అశ్విని పొన్నప్ప–జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది. ఇటీవల అర్జున అవార్డు అందుకున్న గాయత్రి గోపీచంద్ మరోసారి తన ప్రతిభను చాటగా, ట్రీసా జాలీతో కలిసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. సెమీఫైనల్లోనూ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్లో ఫైనల్కు చేరిన తొలి భారత జోడీగా గాయత్రి–ట్రీసా చరిత్ర సృష్టిస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!