

స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వాస్తవానికి ఈ జంటకు తొమ్మిదేళ్ల క్రితమే యూకేలో చట్టబద్ధంగా వివాహం జరిగింది. అయితే గురువాయూర్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలన్న నిధిన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది.
మార్టిన్, నిధిన్ల పరిచయం 2016లో యూకేలో ఏర్పడి, కొద్ది కాలానికే ప్రేమగా మారింది. నిధిన్ వీసా సమస్యలను ఎదుర్కొన్న సమయంలో మార్టిన్ ఆమెకు అండగా నిలిచారు. 2018, 2019, 2023లో కేరళకు వచ్చినప్పటికీ వరదలు, కరోనా మహమ్మారి, కుటుంబ సభ్యుల అనారోగ్యం వంటి కారణాలతో గురువాయూర్ వివాహం వాయిదా పడింది. నాలుగో పర్యటనలో ఎట్టకేలకు ఈ కల సాకారమైంది. ఈ వేడుకకు నిధిన్ కుమారుడు వేదిక్ శంకర్తో పాటు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!