
క్రీడలు

భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక అరుదైన ఘనత సాధించింది. హాంకాంగ్లో జరిగిన ఆసియా ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్ టైటిళ్లను హారిక సొంతం చేసుకుంది. బ్లిట్జ్ విభాగంలో మొత్తం 13 రౌండ్లు పూర్తయ్యే సరికి 10.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ర్యాపిడ్ విభాగంలో 11 రౌండ్ల ముగింపులో 8.5 పాయింట్లతో టాప్ పొజిషన్ దక్కించుకుంది.
మహిళల చెస్లో హారిక తన ప్రతిభను మరోసారి చాటుతూ ఆసియా స్థాయిలో రెండు ప్రతిష్ఠాత్మక టైటిళ్లను సాధించింది. పురుషుల విభాగంలో కేరళకు చెందిన గ్రాండ్మాస్టర్ గౌతమ్ కృష్ణ ర్యాపిడ్, బ్లిట్జ్ రెండు విభాగాల్లోనూ రన్నరప్గా నిలవడం విశేషం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!