

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కంటెస్టెంట్లపై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్ష 2లో పాల్గొన్న 15 మందిలో నుంచి ఐదుగురు లేదా ఆరుగురు కామనర్స్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఝాన్సీ, రోహిత్, అమాన్, చరణ్, సృష్టి, శాలిని, రాజకుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
యూట్యూబ్లో రైతుగా, సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ అగ్నిపరీక్షలో తన ఆటతీరుతో ఆకట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్, అమాన్ కూడా తుది జాబితాలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. చరణ్, సృష్టి ఓటింగ్ ట్రెండ్స్లో దూసుకెళ్తున్నారని, శాలిని, రాజకుమారికి కూడా అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడతారనే దానిపై గ్రాండ్ లాంచ్ రోజునే అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొందరు తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చనే ప్రచారం కూడా ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!