
జనరల్

ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద సంఖ్యలో ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మొగల్తూరు సభలో వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ కొత్త బస్సులను నడిపేందుకు మహిళలు కూడా ముందుకు రావాలని సూచించారు. ఆధునిక రవాణా సదుపాయాలను విస్తరించడంతో పాటు మహిళలకు ప్రయాణ సౌకర్యం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!