

ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ నేతలను కలిసిన అంశంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎదుట బొండా ఉమా హాజరై తన వివరణను సమర్పించారు. అనంతరం ఆయన వివరణపై పార్టీ నాయకత్వం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు బొండా ఉమాకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా ప్రస్తావించకుండా పార్టీ వేదికలలోనే చర్చించాలని సూచించినట్లు సమాచారం. అలాగే కాపు సామాజిక వర్గానికి టీడీపీ చేసిన సేవలు, ప్రత్యర్థి పార్టీ వైఖరి గురించి ఆయనకు అవగాహన ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన విషయాన్ని మాత్రం పార్టీ తప్పుబట్టలేదని నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!