
గాసిప్స్

బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ‘విన్-విన్’ విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై ఇక ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రస్తుత, భావి తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని మోదీ సూచించారు.
భావి తరాల కోసం భారత్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసిందని ప్రధాని తెలిపారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు కలిసి పనిచేయాలని, సహకారం, సుస్థిరాభివృద్ధి, సమష్టి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!