

గాజాలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ త్వరలో ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. హమాస్ ఇంకా ఒక బందీ మృతదేహాన్ని అప్పగించాల్సి ఉందని, అది పూర్తయిన వెంటనే రెండో దశ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
ఈ రెండో దశలో ఉండే ప్రధాన అంశాలు:
హమాస్ నిరాయుధీకరణ
గాజా నిస్సైనికీకరణ
అంతర్జాతీయ దళాల మోహరింపు
పాలస్తీనా పరిపాలన కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అంతర్జాతీయ బోర్డు ఏర్పాటు
జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ ఆదివారం ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన సందర్భంలో నెతన్యాహు ఈ వివరాలు వెల్లడించారు.
‘‘ఒప్పందం మొదటి దశ పూర్తైనప్పటికీ, రెండో దశ అసాధ్యమని చాలామంది అంటున్నారు. కానీ ఒప్పందంలో మూడో దశ కూడా ఉంది. గాజా నుంచి తీవ్రవాదాన్ని పూర్తిగా తొలగించే దశ అది. జర్మనీలో సాధ్యమైంది, జపాన్లో సాధ్యమైంది, గల్ఫ్ దేశాల్లో జరిగింది. గాజాలో కూడా జరుగుతుంది. కానీ అందుకోసం హమాస్ను పూర్తిగా నాశనం చేయాలి’’ అని నెతన్యాహు అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!