
గాసిప్స్

గత ఏడాది నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను సవాల్ చేస్తూ జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిశోర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా బీహార్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద ప్రతి మహిళకు రూ.10,000 పంపిణీ చేయడాన్ని ప్రశాంత్ కిశోర్ తన పిటిషన్లో ప్రశ్నించారు. ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధమని, ఓటర్లపై ప్రభావం చూపే చర్యగా పేర్కొన్నారు. ఈ కారణాలతో ఎన్నికలను రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!