

మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్ను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. అలాగే ఆధునీకరించిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను అధికారికంగా ప్రారంభించారు.
సాంప్రదాయ భక్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు తులాభారం సమర్పించారు. ఈ తులాభారంలో భాగంగా సుమారు 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు అర్పించారు. అనంతరం సీఎం కుటుంబం తొలిమొక్కు సమర్పించి అమ్మవార్లను దర్శించుకున్నారు.
భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర సంప్రదాయాలు, ఆదివాసీ ఆచారాలు కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!