
జనరల్

ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నాయకులతో నిర్వహించిన పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడంపై భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయంగా పార్టీ అధిష్ఠానం కూడా సమావేశానికి హాజరైనప్పుడు.. సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సమావేశానికి రాకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కూడా సముచితం కాదని కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ సమావేశాలకు నాయకులంతా హాజరై, పార్టీ బలోపేతానికి సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలిపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!