
జనరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను లై డిటెక్టర్ పరీక్షకు, సీఐడీ విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన కుటుంబ అవినీతి ఆరోపణలపై సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు.
గ్లోబరీనా సంస్థ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ అన్నారు. ఆ సంస్థ నిజంగానే తన బినామీ సంస్థ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. రాజ్భవన్ ధర్నాకు ముందు కొడంగల్లో నిర్వహించిన నిరసన రాజకీయ నాటకమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి రాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!