
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా బ్లాక్ చేయించిందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఈ వ్యవహారంపై స్పందిస్తూ, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మెటాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ జస్టిస్ రఘునందన్ రావుల ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!