

అస్సాంలో భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళం ప్రకటించారు. వరద బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అస్సాం ప్రజలు ఈ కష్టకాలంలో ఒంటరిగా లేరని ఆమె భరోసా ఇచ్చారు.
ఆర్థిక సాయంతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా శివసాగర్, చరైడియో జిల్లాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర వసతి, అవసరమైన నిత్యావసర వస్తువులను అందిస్తున్నాయి. వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల పునరుద్ధరణ, కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.
అదేవిధంగా రిలయన్స్కు చెందిన వంటరా బృందాలు వరదలతో ఇబ్బందులు పడుతున్న పశువులకు వైద్య సేవలు, సంరక్షణ అందిస్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రిలయన్స్ ఫౌండేషన్, నీతా అంబానీ సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయక చర్యల ద్వారా ఇప్పటికే వేలాది మంది ప్రజలు లబ్ధి పొందినట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.














కామెంట్స్ (1)
Great