

అమెరికాలో ఉన్నత విద్యకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆరోపణలపై క్రౌచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తన చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని, బోస్టన్ యూనివర్సిటీ స్కాలర్షిప్తో పాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేశానని తెలిపారు. తీసుకున్న రుణాన్ని ప్రస్తుతం తిరిగి చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. సీజేపీ నిధులపై వస్తున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ, భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తామని, ప్రతి రూపాయి లెక్కను పారదర్శకంగా వెల్లడిస్తామని చెప్పారు.
ఇటీవల నిరసనల అనంతరం తమ పార్టీపై బాధ్యత మరింత పెరిగిందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించేందుకు సీజేపీ బృందాన్ని విస్తరిస్తామని తెలిపారు. విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. విద్య, ఉపాధి వంటి అంశాలపై భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!