
బిజినెస్

తెలంగాణ హైకోర్టు హైడ్రా వ్యవహారంపై రెండు వేర్వేరు కేసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హయత్నగర్ మండలం సాహెబ్నగర్లోని ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఆదేశించారు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.
మరో కేసులో, కొండాపూర్లోని ప్రైవేట్ స్థలంలో కాంపౌండ్ గోడ, వాచ్మన్ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై జస్టిస్ ఎన్.పీ. శ్రవణ్ కుమార్ హైడ్రా, శేరిలింగంపల్లి తహసీల్దార్ చర్యలను తప్పుబట్టారు. ప్రభుత్వ భూమిగా ఏ ఆధారాలతో పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశిస్తూ, ఆగస్టు 30న వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!