
రాజకీయాలు

హైదరాబాద్లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో టి హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. చిన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కే చంద్రశేఖర్ రావు లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా జరిపామని, బంజారాహిల్స్లో బంజారాల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మించామని గుర్తుచేశారు.
ఇక టీఎస్ ప్రైడ్ ద్వారా 13,200 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ కళాశాలలు నిర్మించామని తెలిపారు. సేవాలాల్, కుమురం భీం, ఏకలవ్య కార్పొరేషన్లకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను మోసం చేస్తోందని హరీశ్రావు విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!