

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా స్పందించారు. తనపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సురేఖ లేఖ రాసిన విషయం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, కొందరు వివాదాలు సృష్టిస్తూ ప్రజల్లో ఉండాలనే కొత్త అలవాట్లు పెంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, అందువల్ల వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖ అధికారులతో తాను సమీక్ష సమావేశం నిర్వహించలేదని, కేవలం సమస్యలను విన్నానని కడియం శ్రీహరి తెలిపారు. అధికారులను తన వద్దకు పిలిస్తే అది సమీక్ష అవుతుందని, అలాంటిది తాను చేయలేదని చెప్పారు. ఆ శాఖపై సమీక్ష చేసే అధికారం తనకు లేదని తెలిసే ఉందని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి కోసం కమిషనర్ను కలిశానని, సమస్యల పరిష్కారానికి అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!