

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేస్తూ, ఆయనను “ద్రవ్యోల్బణ వ్యక్తి”గా అభివర్ణించింది. ఎన్నికలు పూర్తయ్యాక వెంటనే ప్రజలపై భారాన్ని మోపారని ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు వాటు తగ్గిస్తారా అని ప్రశ్నించింది.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యంగా స్పందిస్తూ, “ముందుకు సాగాలంటే సైకిల్ ఒక్కటే మార్గం” అని వ్యాఖ్యానించారు. తన పార్టీ గుర్తు సైకిల్ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి పెరిగిందని కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంధన ధరలను పెంచినట్లు తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!