

ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC) మెన్స్ కప్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు తొలిసారిగా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని దేశానికి గర్వకారణమైంది. ఈ విజయంతో భారత వాలీబాల్కు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించింది. క్రీడా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ మరియు నగరాల ఆధారిత ఫ్రాంఛైజీ వ్యవస్థ ఆటగాళ్ల అభివృద్ధికి కీలకంగా నిలిచాయి.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ వాలీబాల్ క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో, వారికి వేదిక కల్పించడంలో ఆయన చేస్తున్న కృషికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీజీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా స్థానిక క్రికెట్ ప్రతిభను ప్రోత్సహిస్తున్న విజయ్, వాలీబాల్ అభివృద్ధికి కూడా తనవంతు సహకారం అందిస్తూ క్రీడా సంస్కృతిని బలోపేతం చేస్తున్నారని అభిమానులు, క్రీడా ప్రేమికులు అభినందిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!