
బిజినెస్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశాలకు హాజరుకాకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. తమ ప్రజాప్రతినిధులను సభకు రాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య అని పార్టీ ఆరోపించింది.
ఆందోళనల సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి గాయాలయ్యాయని బీఆర్ఎస్ తెలిపింది. ఈ ఘటనలను, ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!