
రాజకీయాలు

అమరావతిను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ కు పార్లమెంట్ రెండు సభలు ఆమోదం తెలిపాయి. నిన్న లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లు, ఈరోజు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించబడింది. ఇప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.
రాష్ట్రపతి సంతకం అనంతరం అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిలవనుంది. ఒక రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. 1953 లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత పొందిన తొలి రాష్ట్రంగా మరో చరిత్ర సృష్టించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!