

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో సినీ పరిశ్రమ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిర్మాత సురేష్ బాబు, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి, జెనీలియా, అక్కినేని అమల సహా ఇతర తెలుగు, హిందీ సినీప్రముఖులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలో “స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో పాటు పరిశ్రమతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకు అవసరమైన శిక్షణను స్థానికులకు అందించడానికి 24 క్రాఫ్ట్లో ప్రత్యేక కార్యక్రమాలు పరిశీలించాలని సినీ వర్గాలకు సూచించారు.
కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఈ గొప్ప అవకాశాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు, “ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన ఆహ్వానం కాదు; ఇది మొత్తం సినీ పరిశ్రమ తరఫున ఇచ్చిన ఆహ్వానం. హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్ హబ్గా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇతర భాషల చిత్రాలు కూడా హైదరాబాద్లో షూటింగ్స్ చేయాలని సీఎం ప్రోత్సహిస్తున్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మరిన్ని సమావేశాలు నిర్వహించనున్నాం. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి సినీ హబ్గా మార్చే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విభిన్న రంగాలకు చెందిన నిపుణులు ఈ లక్ష్యానికి తోడ్పడుతున్నారు”, అని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!