

జ్యుడీషియరీ వ్యవస్థపై వివాదాస్పద పాఠ్యాంశం 8 వ తరగతి పాఠ్యపుస్తకంలో ముద్రించినందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) బహిరంగంగా బేషరుతుగా క్షమాపణ చెప్పింది. ఈ విషయంపై మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 8 వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకం ‘సమాజం అన్వేషణ: ఇండియా, అంతకుముందు’ (పార్ట్-2)లోని నాలుగో అధ్యాయంలో ‘మన సమాజంలో జ్యుడీషియరీ పాత్ర’ అనే శీర్షికతో ఇటీవల పాఠ్యాంశం ముద్రించినట్లు తెలిపింది. ఆ పాఠ్యాంశం ప్రచురణపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ డైరెక్టర్తో పాటు సభ్యులందరూ ఎటువంటి సమర్థనలు లేకుండా క్షమాపణ చెబుతున్నామని పేర్కొన్నారు. అలాగే ఆ పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నామని వెల్లడించారు.
‘జ్యుడీషియరీలో అవినీతి’ అనే అంశం పుస్తకంలో చోటు చేసుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూమిపై ఏ సంస్థ అయినా న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకొని ఆ పాఠ్యపుస్తకాన్ని ఉపసంహరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!