
సినిమాలు

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్ 2’ పైరసీ సమస్యను ఎదుర్కొంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో కొనసాగుతున్న ఈ సినిమా ఇటీవల ప్రముఖ వీడియో వేదిక యూట్యూబ్లో లీక్ కావడం చర్చనీయాంశమైంది.
గుర్తుతెలియని వ్యక్తులు ఈ చిత్రాన్ని అక్రమంగా పూర్తి నిడివితో అప్లోడ్ చేశారు. మొబైల్ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియో దాదాపు నాలుగు గంటల నిడివి కలిగి ఉండగా, అది ఇప్పటికే వేలాది మంది చూసినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఈ లీక్ను గమనించిన అభిమానులు వెంటనే దర్శకుడికి సమాచారాన్ని అందించారు. అభిమానుల ఫిర్యాదుతో చిత్రబృందం వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత వేదిక నిర్వాహకులను సంప్రదించింది. దాంతో ఆ పైరసీ లింక్ను తొలగించడం జరిగింది.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!