

తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్ విన్యాసాలు, ఐవోఎన్ఎస్ చీఫ్ ఆఫ్ నేవీస్ కాంక్లేవ్కు విశాఖపట్నం నగరం సిద్ధమవుతోంది. యుద్ధ విన్యాసాలు మరియు వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన నౌకాదళాధికారులు, యుద్ధనౌకలు, నావికులు విశాఖ నేవల్ బేస్కు చేరుకుంటున్నారు. తూర్పు నౌకాదళ అధికారులు విదేశీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈనెల 15 నుంచి ఐఎఫ్ఆర్ 2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే మాల్దీవులు, వియత్నాం, సీషెల్స్, ఫిలిప్పీన్స్ దేశాల నౌకాదళాలు విశాఖకు చేరుకున్నాయి.
మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బందితో పాటు సీజీఎస్ హురవీ, సీషెల్స్కు చెందిన ఎస్సీజీఎస్ జొరాస్టర్ కోస్ట్గార్డ్ నౌక, వియత్నాం యుద్ధనౌకలకు తూర్పు నౌకాదళం ఆతిథ్యం అందించింది. శుక్రవారం రాత్రి మరికొన్ని దేశాలకు చెందిన నౌకలు కూడా చేరుకున్నాయి. శనివారం సాయంత్రానికి వివిధ దేశాలకు చెందిన మొత్తం 23 యుద్ధనౌకలు విశాఖకు చేరుకోనున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఇది అంతర్జాతీయ సముద్ర సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!