

కేంద్ర బడ్జెట్ 2026–27లో రవాణా రంగానికి ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం మొత్తం 7 హైస్పీడ్ రైలు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో ముఖ్యంగా నాలుగు ప్రధాన మార్గాలను వెల్లడించారు.
మొదటిది ముంబై నుంచి పూణె వరకు.
రెండోది పూణె నుంచి హైదరాబాద్ వరకు.
మూడోది హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు.
నాలుగోది బెంగళూరు నుంచి చెన్నై వరకు హైస్పీడ్ రైలు మార్గం అభివృద్ధి చేయనున్నారు.
ఈ కారిడార్లతో పాటు దేశవ్యాప్తంగా నగరాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అదనపు కారిడార్లను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రయాణ సమయం తగ్గించడం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడం, ఆధునిక రవాణా సదుపాయాలు అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!