
ఆరోగ్యం
టీటీడీ పరకామణి వ్యవహారం పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పరకామణి నిర్వహణలో టెక్నాలజీ వినియోగం చేయడం ఒక మంచి పరిణామమని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను పొర్లించడం, తొక్కడం సరైన విధానం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అలాగే, భక్తులను బట్టలు విప్పి తనిఖీలు చేయడం వల్ల వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ, ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరకామణి నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!