
న్యూస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. కార్మికుల సమస్యలపై పలుమార్లు పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీ యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కార్మికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు ప్రభావితం కావచ్చని హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!