

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ క్యాంపస్లో లైంగిక వేధింపులు, మత మార్పిడుల ఆరోపణలతో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై టీసీఎస్ స్పందిస్తూ, నిందితులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేస్తూ, పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపింది.
పోలీసుల వివరాల ప్రకారం, పెళ్లి పేరుతో మోసం చేశారని ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అనంతరం మరికొంత మంది మహిళలు ముందుకు వచ్చి అనుచితంగా తాకడం, అసభ్య వ్యాఖ్యలు, బాడీ షేమింగ్, ఆహారపు అలవాట్లపై ఒత్తిడి వంటి వేధింపులపై ఆరోపణలు చేశారు. మహిళా పోలీసులు అండర్కవర్ ఆపరేషన్ నిర్వహించి ఒక నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. 40కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఐటీ ఉద్యోగుల సంఘాలు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను సంప్రదించి అన్ని సంస్థల్లో భద్రతా ప్రమాణాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరాయి. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ, సీనియర్ అధికారుల నేతృత్వంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!